రైల్వేలో టీటీ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.25,08,000లు కాజేసిన ఇద్దరు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు వల్లంపూడి ఎస్సై సుదర్శన్ తెలిపారు. వేపాడ మండలం పీకేఆర్ పురం గ్రామానికి చెందిన N. సన్యాసినాయుడు కుమారుడు రాజేశు ఉద్యోగం ఇప్పిస్తామని బొండపల్లి మండలం వంపల్లికి చెందిన గౌరీ శంకర్, గంట్యాడ మండలం పెదవేమలికి చెందిన సతీశ్ మోసానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది.










