భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి : నల్లచెరువు మండలంలో ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా ‘ఒక దీపం–ఒక ఆశీర్వాదం’ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించారు.మోదీ ప్రజాప్రతినిధిగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాయకులు, కార్యకర్తలు దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దేశ ప్రగతికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ మరిన్ని సంవత్సరాలు దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్ రాజశేఖర్ బాబు, గుత్తా ప్రసాద్, సతీష్ చౌదరి, అంజినప్ప, జక్కా లక్ష్మీనారాయణ, నరేష్, బీజేపీ శంకర, రాళ్లపల్లి ఇంతియాజ్, అల్లా బక్షు, రమణ, వినోద్ తదితరులు పాల్గొన్నారు










