వైరల్ స్క్రీన్‌షాట్‌పై ఎమ్మెల్యే వివరణ.|

0
16

● సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడి

● నకిలీ స్క్రీన్‌షాట్‌ను నమ్మొద్దని విజ్ఞప్తి

● సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుపై దృష్టి మళ్లించే ప్రయత్నమని ఆరోపణ

అల్వాల్, సెప్టెంబర్ 16: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ భూములను బినామీల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయాలంటూ సబ్‌రిజిస్ట్రార్‌ను బెదిరించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంపై ఆయన వర్గాలు స్పందించాయి.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న బ్రేకింగ్ న్యూస్ స్క్రీన్‌షాట్ నకిలీదని, అందులోని ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేకు సంబంధించినట్లుగా వైరల్ చేస్తున్న స్క్రీన్‌షాట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు డిజిటల్‌గా రూపొందించి వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

ఆ స్క్రీన్‌షాట్‌లో పేర్కొన్న అంశంపై ఎలాంటి విచారణ లేదా నివేదిక ఉన్నట్లు తమ దృష్టికి రాలేదని స్పష్టం చేశారు.

అల్వాల్ ప్రాంత ప్రజల సౌకర్యార్థం కొత్తగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయించేందుకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి అంశాన్ని తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

ఈ ప్రయత్నాన్ని పక్కదారి పట్టించేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన వర్గాలు ఆరోపించాయి.

సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని ధృవీకరించకుండా నమ్మవద్దని, ఇలాంటి నకిలీ స్క్రీన్‌షాట్లను ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

#sidhumaroju

Alwal