భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి : కదిరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా కదిరి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన “స్వచ్ఛత హి సేవ – సేవా సంకల్ప్ అభియాన్” కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా “ఆశీర్వాద్ కా దియా” వెలిగించి స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడంలో పారిశుధ్య కార్మికుల సేవలను ఎమ్మెల్యే అభినందించారు. స్వచ్ఛ కదిరి సాధనకు ప్రజలు, అధికారులు, పారిశుధ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.










