చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026 -27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిగ్రీ కోర్సుల్లో సెకండ్ ఫేజ్ అడ్మిషన్లకు సీట్లు అందుబాటులో ఉన్నాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. మణిమాల తెలిపారు. ఇంటర్మీడియట్ లేదా సమానమైన విద్యార్హతలు పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు కళాశాలను సంప్రదించి అందుబాటులో ఉన్న కోర్సులు, సీట్ల వివరాలు మరియు అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలని కోరారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కార్యాలయంలో ఆన్లైన్ చేయించుకోవాలని తెలియజేశారు. సెకండ్ ఫేజ్ అడ్మిషన్లకు సంబంధించిన గడువు తేదీలోపు 18-09- 2026 నుండి 21 -09 -2026 వరకు విద్యార్థులు అవసరమైన ధృవపత్రాలతో కళాశాలను సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చునని తెలిపారు.
# Yadagiri










