Madanapalle: తమ ఆస్తులు సక్రమమేనని, అక్రమమని నిరూపిస్తే బహిరంగంగా సీజ్ చేసుకోవచ్చని మార్పురి వెంకటేష్ నాయుడిపై కోనేటి సులోచన కుమార్తె అనూష సవాల్ విసిరారు.

0
2

మదనపల్లె: తన తల్లి కోనేటి సులోచన పేరుతో ఉన్న ఆస్తి సక్రమంగా వచ్చినదేనని, అది అక్రమార్జన కాదని కోనేటి అనూష తెలిపారు. ఈ మేరకు గురువారం బెంగళూరు రోడ్డులోని ప్రెస్ క్లబ్‌లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోనేటి అనూష మాట్లాడుతూ తాము గత 17 సంవత్సరాలుగా మదనపల్లెలో నివసిస్తున్నామని, మార్పురి వెంకటేష్ నాయుడుతో తమ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మార్పురి వెంకటేష్ నాయుడు తన తల్లి కోనేటి సులోచనకు స్వయంగా రిజిస్ట్రేషన్ చేయించిన ఆస్తిపై కొందరు కన్నేసి, ఆయనను పావుగా ఉపయోగించుకుని తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.