ఏసీబీ వలన గోవిందరావుపేట తాసిల్దార్…..!

0
3

ఏసీబీ వలలో గోవిందరావుపేట తహసీల్దార్…

భారత్ అవాజ్ న్యూస్: సెప్టెంబర్ 19 తేదీన ములుగు జిల్లా   పౌతి మార్పిడికి లంచం తీసుకుంటూ గోవిందరావుపేట మండల తహసీల్దార్ ఏసీబీ కి పట్టుబడిన ఘటన ములుగు జిల్లాలో సంచ లనంగా మారింది. గోవిందరావుపేట మండల పరిధిలోని 1.05ఎకరాల భూమి యజమాని ఇటీవల మృతి చెందగా పౌతి మార్పిడి చేసి పట్టా చేయించేందుకు సంబంధిత కుటుంబస భ్యులు తహసీల్దార్ సృజన్ కుమార్ను ఆశ్ర యించారు. ఈ క్రమంలో పౌతి మార్పిడికి తహసీల్దార్ రూ.14 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళికతో తహసీల్దార్ కార్యాలయంలో దాడులు చేసి పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై విచారణ చేప డుతున్నారు. ఈ విషయమై ఏసీబీ అధికారులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము