Home South Zone Andhra Pradesh మొంథా తుఫాన్: తీరంలో కలకలం

మొంథా తుఫాన్: తీరంలో కలకలం

0

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాను తీవ్రరూపం దాల్చి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సమీపిస్తోంది.

ముఖ్యంగా ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ మరియు పరిసర ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీయనున్నాయి.

అధికారులు NDRF, SDRF బృందాలను రంగంలోకి దించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లకు సమాచారం అందించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఈ సమయంలో అనవసర ప్రయాణాలు మానుకోవడం ఉత్తమం.

NO COMMENTS

Exit mobile version