కర్నూలు :
కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పుత్తడి వెలుగులతో విరాజిల్లుతుంది. తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి పగిడిరాయి గ్రామాల పరిధిలోని పొలాలలో బంగారు నిధి నిక్షేపాలకోసం చాలా సంవత్సరాలుగా పరిశోధన తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి .
జొన్నగిరి పగిడి రాయి గ్రామాల పరిధిలోని కొన్ని వేల ఎకరాలలో జియో మైసూర్ సంస్థ ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది పనులు మొదలుపెట్టింది.
ఒక టన్ మట్టి లో 1.5 నుంచి రెండు గ్రాముల బంగారం ఉత్పత్తి అవుతుంది.
ఈ సంస్థకు ఒక టన్ మట్టి నుంచి బంగారం వెలికి తీసేందుకు 4 వేల నుంచి 5 వేల రూపాయలు ఖర్చు అవుతుంది.
వేయి టన్నులకు సుమారుగా 700 గ్రాముల బంగారం ఉత్పతి అవుతున్నట్టు సమాచారం.