పుంగనూరు పట్టణంలో నిషేధిత లాటరీ టికెట్లు విక్రయిస్తున్న గోవిందప్ప, మోహన్ బాబులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3400 విలువైన 17 నిషేధిత లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఏ.ఎస్సై అశ్వత్థ నారాయణ తెలిపారు. నిషేధిత లాటరీ టికెట్లు విక్రయిస్తున్న సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు# కొత్తూరు మురళి.
