కూటమి ప్రభుత్వం అభివృద్ధిని వదిలి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ నివేదికే స్పష్టం చేసిందని, అబద్ధాలు ప్రచారం చేసినందుకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు హిందూత్వాన్ని వాడుకుంటున్నారని, పాలన చేతకాకపోతే జగన్ను చూసి నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు.
