న్టీఆర్ జిల్లా అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట పినపాల లిఖిత అనే గర్భిణి ఆందోళనకు దిగారు. నెల రోజుల క్రితం తన భర్త పవన్ కుమార్ అదృశ్యంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
భర్త బంధువులే ఆయనను దాచిపెట్టారని, తనకు వెంటనే న్యాయం చేయకుంటే స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించారు.
