విజయవాడలోని రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపి నాయకులు భారీ ధర్నా చేపట్టారు. మంగళగిరి చినకాకానిలోని 71.5 ఎకరాల అంజుమన్ భూమి ప్రైవేటీకరణను మరియు ఐటీ పార్క్ నిర్మాణానికి ఇచ్చిన నోటిఫికేషన్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో ఎమ్మెల్సీ రుహుల్లా, నూరీ ఫాతిమా మరియు ఇతర ముస్లిం నేతలు పాల్గొని, “అంజుమన్ హమారా.. హక్ హమారా” అంటూ నినాదాలతో హోరెత్తించారు. బోర్డు సమావేశం ముగిశాక బయటకు వచ్చిన వక్ఫ్ బోర్డు డైరెక్టర్, ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్ను నిరసనకారులు నిలదీశారు. ముస్లింల ఆస్తులను కాపాడే వరకు పోరాటం ఆపమని నేతలు స్పష్టం చేశారు.
#MangalagiriAnjumanLands
#వక్ఫ్బోర్డుధర్నా #వైఎస్సార్ #YSRCP
https://www.bharataawaz.com/
