రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తికి వైఎస్ జగన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె మాట్లాడుతూ, గత ఐదేళ్లలో ఏపీని డ్రగ్స్ హబ్గా మార్చారని ఆరోపించారు.
నాసిరకం మద్యం విక్రయాల ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసి, వేల కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ముందు జగన్ మోకరిల్లారని ఎద్దేవా చేశారు.
మహిళా భద్రత, పోలవరం పూర్తి చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి మళ్ళీ పూర్వవైభవం వస్తుందని, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
