భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
ఈ మహోత్సవాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ *ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు మరియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీగా ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీ మొత్తం అంబేద్కర్ గారి జయజయధ్వానాలతో మార్మోగి, ఆయన ఆలోచనలు మరియు ఆశయాలను గుర్తుచేసే విధంగా సాగింది. అనంతరం అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










