రెండు రోజులుగా కరెంట్ కష్టాలు

0
4

బొబ్బిలి మున్సిపాలిటీలోని మల్లమ్మపేట, ఇందిరమ్మ కాలనీ, ఐటీఐ కాలనీ, జగనన్న కాలనీకు రెండు రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వేసవిలో రెండు రోజులు విద్యుత్ సరఫరా లేకపోతే ఎలా ఉండేదని విద్యుత్ శాఖాధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లో వోల్టేజీ సమస్య వలన విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని AE సాంబశివరావు చెప్పారు. విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

#Boiena Rajesh