మంచిర్యాల : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులుతో మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కాళేశ్వరం ప్రాంతంలో నిర్వహించనున్న పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొననున్నారు,మధ్యాహ్నం 3:00 గంటలకు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం వద్ద స్వామి వారి దర్శనం చేసి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తరువాత 3:45 గంటలకు మెడిగడ్డ బ్యారేజ్ వద్ద ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించనున్నారు.
4:35 గంటలకు అంబట్పల్లి గెస్ట్ హౌస్లో సాగునీటి శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు.5:35 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొననున్నారు.సాయంత్రం 6:30 గంటలకు నస్తూరపల్లి గ్రామంలో నిర్వహించనున్న ప్రజా సమావేశంలో పాల్గొననున్నారు.










