చీరాల శాసనసభ్యుల మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం వేసవి దృష్ట్యా వేటపాలెం గ్రామపంచాయతీ కొచ్చే ప్రజల సౌకర్యార్థం వాటర్ ఫ్రిజ్ ను చీరాల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దోగుపర్తి బాలకృష్ణ స్పాన్సర్ గా అందజేశారు.ఈ యొక్క ఫ్రిజ్ ను వేటపాలెం మండలం ఎంపీడీవో రాజేష్ ప్రారంభించడం జరిగింది.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు జాగబత్తుని పోతురాజు, చీరాల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు దోగుపర్తి బాలకృష్ణ, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు పత్తి ముత్తుకమరన్, వాణిజ్య విభాగం మండల అధ్యక్షులు చుండూరి నాగాంజనేయులు, ఊటికూరి కోటి స్వామి గుప్తా, పాలెం మస్తాన్, మరియు పంచాయతీ సిబ్బంది నాయకులు పాల్గొనడం జరిగింది









