నందిగామలో పూర్వ వైభవం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ

0
4

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ,పాత బస్టాండ్ లో ఉన్నటువంటి పురాతనమైన కోనేరు పుష్కరిణి చుట్టూతా ఉన్న ఆక్రమణలను హైకోర్టు ఆదేశాల మేరకు తొలగించి.. కోనేరును పరిరక్షించి తిరిగి పునర్ వైభవం తీసుకు రావాలని కోరుతూ నందిగామ హిందూ సంఘాల జే.ఏ.సి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం శివాలయం నుండి మెయిన్ బజార్, గాంధీ సెంటర్, చందర్లపాడు బస్టాండ్ వద్ద ఉన్నటువంటి పార్వేట మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఓం నమఃశ్శివాయ అంటూ నినాదాలు చేశారు.

అధికారులు హై కోర్ట్ ఆర్డర్ ను తక్షణం అమలు చేయాలని కోరారు కోనేరును వెంటనే స్వాధీన పరుచుకుని శివాలయం కు ఒప్ప చెప్పాలని నినదించారు.ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు తొర్లికొండ సీతారామయ్య,మునగంటి కామేశ్వరరావు,పారేపల్లి సాయిబాబు, వందేమాతరం అశోక్, పులిపాటి లక్ష్మణరావు, చిరుమామిళ్ళ శ్రీనివాసరావు, వై.యస్.బాబు, నకరికంటి నరేష్, ఆర్.కే.సాయి, పబ్బతి గుప్త,కుంచం లక్ష్మీనారాయణ, తులసీ కృష్ణ, కొమ్మినీడి సత్యనారాయణ,మారం అమరయ్య, చవట నాగేశ్వరరావు, సబ్నవీసు ఫణి,నూతక్కి విజయ్, సూరే రాంబాబు, జల్లా రవి, మన్నెం హనుమంతరావు, కొత్త నాగ ప్రభాకర్, మిట్టపల్లి మురళీ, వెన్నెల శ్రీను,కేతేపల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.