ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ:—-
చంద్రన్న మీ ఇంటికి నన్ను పంపారు ప్రతి ఇంట్లో చిరునవ్వును చూడడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని లబ్ధిదారులతో అన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం క్రమం తప్పకుండా ఒకటవ తేదీ పెన్షన్లను ఇస్తున్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని అవ్వ తాత చిరునవ్వుతో కూటమి పాలనలో ఒకటవ తారీకు పింఛన్లు పంపిణీ ప్రభుత్వం చేస్తుందని అన్నారు.కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో చీరాల నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా మన నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రాంతాలను అభివృద్ధి ప్రాంతాలుగా మార్చుకునేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇస్తుందని.
నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు తీసుకు వెళ్తున్నామని. మౌలిక సదుపాయాల కల్పన, ఇంటింటికి కులాయి ఏర్పాటు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కృషి జరుగుతుందన్నారు.అదేవిధంగా నియోజకవర్గంలో కూడా గ్రామ గ్రామాన అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ కౌతరపు జనార్ధన్, సజ్జ హేమలత, డోగుపర్తి సురేష్, మించాల సాంబశివరావు, పొత్తూరి సుబ్బయ్య, వల్లెపు వేణు, నాగేంద్రమణి, గోలి జగదీష్, పిక్కి నారాయణ, యానాదిరావ్ , వార్డు అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు సచివాల సిబ్బంది పాల్గొన్నారు.










