హైదరాబాద్ : సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్లోని గాంధీభవన్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
జిల్లా అధ్యక్షుడు దీపక్ జాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం మరియు రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలపై కమిటీ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందించడంతో పాటు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు (11-12 తరగతులు) మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించిన సమగ్ర పౌష్టికాహార కార్యక్రమంపై నేతలు హర్షం వ్యక్తం చేశారు.
నిరుపేద విద్యార్థుల బాగుకోసం ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశారు.
అనంతరం కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించిన కమిటీ, ప్రధాని మోడీ ప్రభుత్వం సంతకం చేసిన అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల దేశీయ ప్రయోజనాలకు మరియు స్థానిక మార్కెట్కు విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఒప్పందాన్ని తక్షణమే తిరస్కరించాలని డిమాండ్ చేస్తూ మరో కీలక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఈ సమావేశంలో ఎంపీ శ్రీమతి కావ్య, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు.. నవీన్ యాదవ్, శ్రీగణేష్ లతో పాటు సికింద్రాబాద్ జిల్లా అసెంబ్లీ ఇంచార్జిలు, వివిధ ఫ్రంటల్స్ మరియు సెల్స్ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, పార్టీ ప్రతిష్టను మరింత పెంచాలని నేతలు ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
#Sidhumaroju








