ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల పవన్ కళ్యాణ్కు సర్జరీ జరగడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. తగిన విశ్రాంతి తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.










