చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే సమ్మర్ క్యాంప్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో గుజ్జుల నరసింహారెడ్డి అన్నారు. గురువారం చిలుకూరులో పీఎం శ్రీ జిల్లా పరిషత్ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ నిర్వాహాణపై నిర్వహించన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు.
మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ‘అర్హులని తెలిపారు. ఈనెల 11వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఈ సమ్మర్ క్యాంపు నిర్వహిస్తారని తెలిపారు. సమ్మర్ కాంప్ లో విద్యార్థులకు ఆటలతో పాటు క్విజ్, ఆర్ట్ డాన్స్, స్కిల్ డెవలప్మెంట్ నేర్పించనున్నట్లుగా తెలిపారు. సమ్మర్ క్యాంపుకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి పత్రం తీసుకొని రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారాం, ఉపాధ్యాయులు కోదండ రామయ్య రామారావు రవికుమార్ పిడి రేణుక తదితరులు పాల్గొన్నారు.










