మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ డివిజన్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురం వెంకటేశ్వర నగర్ కాలనీలో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో మార్మోగింది.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణలు, అర్చనలు నిర్వహించగా భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.
అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం కూడా భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు.
ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాలను సమన్వయం చేసి విజయవంతంగా నిర్వహించారు.
ఆలయ కమిటీ అధ్యక్షుడు టీ కమలయ్య, జనరల్ సెక్రటరీ కె రంగారావు, ట్రెజరర్ సి మోహన్ ప్రత్యేక ఏర్పాట్లు పర్యవేక్షించారు. అన్నదాన కార్యక్రమాన్ని బైకన్ సత్యనారాయణ యాదవ్ నిర్వహించారు.
హనుమాన్ జయంతి వేడుకలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.
#Sidhumaroju
Alwal










