“సంచలన జర్నలిజం కంటే బాధ్యతాయుత జర్నలిజం గొప్పది.|

0
18

హైదరాబాద్ : మీడియా ట్రయల్స్, సోషల్ మీడియా ప్రచారం, కుటుంబాల మానసిక క్షోభపై ఒక విశ్లేషణ.

ఈరోజుల్లో ఒక కేసు బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్, డిజిటల్ మీడియా వేదికలు, రాజకీయ పేజీలు తీర్పులు చెప్పే స్థాయికి చేరుకున్నాయి.

విచారణ ప్రారంభం కాకముందే “ఇతనే తప్పు చేశాడు”, “వాళ్ల కుటుంబం ఇలా ఉంది”, “అధికారాలు అడ్డుపడుతున్నాయి” అనే విధంగా పోస్టులు, థంబ్‌నెయిల్స్, డిబేట్లు నడుస్తున్నాయి. ఒక కేసు నిజమా కాదా అన్నది కోర్టు తేల్చకముందే, ప్రజల ముందే ఒక వ్యక్తిని నిందితుడిగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇది కేవలం ఒక వ్యక్తి ప్రతిష్టకే కాదు, అతని కుటుంబం, బంధువులు, భవిష్యత్తు, మానసిక స్థితి మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.

ప్రత్యేకంగా రాజకీయ నాయకులు లేదా ప్రముఖుల కుటుంబాలకు సంబంధించిన కేసుల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తోంది.

ఒక ఫిర్యాదు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో ఆ కుటుంబ సభ్యుల ఫోటోలు వైరల్ చేయడం, వ్యక్తిగత జీవితాన్ని చర్చించడం, రాజకీయంగా అనుసంధానం చేయడం, భావోద్వేగాలను రెచ్చగొట్టేలా పోస్టులు వేయడం ఇప్పుడు సాధారణమైపోయింది.

కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. చట్టపరమైన విచారణ పూర్తికాకముందే ఒకరిని పూర్తిగా తప్పుదారుడిగా చూపించడం ఎంతవరకు న్యాయం?

భారత రాజ్యాంగం ప్రకారం, ఏ వ్యక్తినైనా కోర్టు దోషిగా నిర్ధారించే వరకు అతను “ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి” మాత్రమే. దీనిని న్యాయవ్యవస్థలో “Presumption of Innocence” అని అంటారు. అంటే నేరం రుజువయ్యే వరకు ప్రతి వ్యక్తిని నిర్దోషిగానే పరిగణించాలి. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా పరిస్థితి చూస్తే, ఈ సూత్రం పూర్తిగా కనుమరుగవుతున్నట్టే కనిపిస్తోంది.

ఒక ఆరోపణ వచ్చిందంటే చాలు, చాలామంది ముందుగానే తీర్పులు చెప్పేస్తున్నారు. కొన్ని మీడియా వేదికలు కూడా వార్తను సమతుల్యంగా చూపించకుండా, ఒకపక్షంగా కథనాలు నిర్మిస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.

ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. ఒక అమ్మాయి ఫిర్యాదు చేస్తే, దానిని గౌరవంగా, చట్టపరంగా తీసుకోవాలి. బాధితురాలికి న్యాయం జరగాలి.

ఇది ఎంత ముఖ్యమో, అదే విధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కూడా న్యాయం జరిగే హక్కు ఉంది. అంటే ఫిర్యాదు చేసిన అమ్మాయిని ముందే అబద్ధం చెబుతోందని అనకూడదు. అలాగే అబ్బాయిని కూడా ముందే నేరస్తుడిగా ప్రకటించకూడదు.

ఈ balance కోల్పోతే విచారణ కంటే “public opinion” పెద్దది అవుతుంది. అదే ప్రమాదకరం.

ఇప్పుడు చాలా సందర్భాల్లో వార్త కంటే narrative ఎక్కువగా కనిపిస్తోంది.

“ఇంకా ఎంత మందిని కాపాడతారు?”, “అసలు నిజం ఇదే!”, “పెద్దల ఒత్తిడి!” వంటి పదజాలంతో ప్రజల్లో కోపం, ద్వేషం పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కొన్ని thumbnails, పోస్టులు చూస్తే అవి సమాచారం ఇవ్వడం కోసం కాకుండా, ఒక భావనను బలవంతంగా నాటేందుకు తయారు చేసినట్టుగా అనిపిస్తాయి.

అలాంటి ప్రచారం వల్ల నిజానిజాలు బయటకు రాకముందే ఒక కుటుంబం సమాజంలో అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇది కేవలం రాజకీయాలు లేదా మీడియా వరకు మాత్రమే పరిమితం కాదు.

సోషల్ మీడియా ట్రయల్ అనే కొత్త ప్రమాదకర సంస్కృతి పెరుగుతోంది. కోర్టు విచారణ మొదలయ్యేలోపే YouTube తీర్పు చెబుతోంది. Facebook పోస్టులు నిందితుడిని ఖరారు చేస్తున్నాయి.

WhatsAppలో rumors తిరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కుటుంబాలు బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడుతోంది. పిల్లలు స్కూల్ లేదా కాలేజీల్లో అవమానాలు ఎదుర్కొంటున్నారు. పెద్దలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

కొన్ని సందర్భాల్లో depression, anxiety వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. ఒక కేసు తర్వాత నిజం ఏదైనా కావచ్చు, కానీ విచారణ పూర్తికాకముందే ఒక కుటుంబాన్ని “సామాజిక శిక్ష” విధించడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది.

ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర చాలా గొప్పది. ప్రభుత్వాలను ప్రశ్నించడం, కేసులపై సమాచారం ఇవ్వడం, ప్రజలకు అవగాహన కల్పించడం మీడియా బాధ్యత.

కానీ అదే మీడియా sensationalism కోసం ఒకపక్ష కథనాలు నడపడం ప్రారంభిస్తే, అది జర్నలిజం కంటే ప్రచారంగా కనిపిస్తుంది. TRPలు, views, రాజకీయ ప్రయోజనాలు, సోషల్ మీడియా reach కోసం ఒక కుటుంబాన్ని మానసికంగా క్షోభకు గురిచేయడం బాధ్యతాయుత వ్యవహారం కాదు.

ఇప్పటి పరిస్థితుల్లో ప్రతి కేసు రాజకీయ కోణంలో కూడా చూడబడుతోంది. ఒక నాయకుడి కుటుంబానికి సంబంధించిన విషయం వస్తే ప్రత్యర్థి వర్గాలు దానిని రాజకీయ ఆయుధంగా వాడుతున్నాయి.

సోషల్ మీడియా టీమ్స్ narrative build చేస్తున్నాయి. కొన్ని మీడియా వర్గాలు కూడా తటస్థత కోల్పోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ చివరకు నష్టపోయేది నిజం, న్యాయం, కుటుంబాల గౌరవం.

చట్టం ముందు అందరూ సమానమే అనే మాట కేవలం రాజకీయ నినాదం కాదు. అది ప్రజాస్వామ్యానికి మూల సూత్రం.

ఒక ఆరోపణ వచ్చిన వెంటనే ఎవ్వరినీ దేవుడిగా చూడకూడదు. అలాగే దెయ్యంగా కూడా ప్రకటించకూడదు.

నిజాలు పూర్తిగా బయటకు రావడానికి సమయం పడుతుంది. విచారణ సంస్థలు పని చేయాలి. కోర్టులు నిర్ణయం చెప్పాలి. మీడియా పని సమాచారం ఇవ్వడం వరకు. తీర్పు చెప్పడం కాదు.

ఎందుకంటే ప్రతి headline వెనుక ఒక కుటుంబం ఉంటుంది. ప్రతి viral post వెనుక ఎవరో ఒకరి జీవితం ఉంటుంది.

#Sidhumaroju✍️