తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి

0
4

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చైర్‌పర్సన్‌తోపాటు ఆరుగురు సభ్యులతో కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వు లు జారీచేశారు.

‎కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత,శశికళా యాదవరెడ్డి, సదాలక్ష్మి, ఎన్‌ రాధాబాయి,ఉజ్మా ఆషై షకీరాను సభ్యులుగా నియమించారు.ఐదేండ్లపాటు వారు ఈ పదవు ల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

‎కాగా కాంగ్రెస్‌ అసలు నేతల కు రేవంత్‌ ప్రభుత్వం మొండిచెయ్యి చూపించి,వలస కాంగ్రెస్‌ నేత విజయలక్ష్మికే మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవి ఇస్తున్నారని అనుకున్నది నిజంగానే అయింది వలస కాంగ్రెస్‌కే మరో పదవి శీర్షికతో ఈ ఏడాది ఫిబ్రవరి 4న కథనం ప్రచురించింది.

‎పార్టీ కోసం కష్టపడిన మాజీ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద కేవలం 14 నెలలు మాత్రమే పని చేశారని,కానీ సీఎం మాత్రం..

‎బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి వచ్చిన కేశవరావు కుమార్తె విజయలక్ష్మి కోసం సీటు రిజర్వ్‌ చేసిపెట్టారని కథనంలో వివరించింది. ఈ కథనంపై అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీవర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

‎కాగా చివరికి ఆమెకే అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.