శస్త్రచికిత్స అనంతరం మూడు వారాల విశ్రాంతి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత Pawan Kalyan నేడు తిరిగి విధుల్లోకి చేరనున్నారు.
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఉదయం 10:40 గంటలకు Gannavaram చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో Mangalagiri క్యాంపు కార్యాలయానికి వెళ్లనున్నారు. పవన్ తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తుండటంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. గన్నవరం నుంచి మంగళగిరి వరకు ఘన స్వాగతానికి నాయకులు, అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు.








