చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్లలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. చివరి దశకు చేరుకున్న పనులకు నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, పనులు త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సురేంద్రనాథరెడ్డి, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










