ప్రభుత్వ చలివేంద్రాలు ప్రచార ఆర్భాటమే: సిపిఎం విమర్శ.

0
1

మదనపల్లెలో ప్రభుత్వ చలివేంద్రాలు కేవలం ప్రచార ఆర్భాటంగానే మారాయని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు ఆదివారం విమర్శించారు. మండుటెండల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, అధికారిక చలివేంద్రాల్లో తాగునీరు అందుబాటులో లేకపోవడం దారుణమని ఆయన అన్నారు. ఆదివారం ఆయన ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. చాలా చలివేంద్రాలు ప్రారంభోత్సవానికే పరిమితమయ్యాయని, ప్రజాధనం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా నిరంతరం నీరు, మజ్జిగ అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.