భారత్ అవాజ్ న్యూస్: 17 మే తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇవాళ 8.30AM నుంచి రేపు 8.30AM మధ్య పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవొచ్చని IMD తెలిపింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో 2-3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని హెచ్చరించింది…. దుగ్గొండి మండలం రిపోర్టర్ జిరామ్..










