అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కింపులో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏకాంబరం తెలిపారు. 54 రోజులకు గాను రూ.1,01,85,400 నగదు, 29 గ్రాముల బంగారం, 466 గ్రాముల వెండిని భక్తులు అమ్మవారికి కానుకలుగా సమర్పించారు. భక్తుల కోర్కెలు తీరడంతో అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారని, ఈ ఆదాయం రికార్డు స్థాయిలో ఉందని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.










