మంగళవారం సాయంత్రం మదనపల్లెలో వైఎస్సార్సీపీ మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో మునిసిపల్ వార్డుల పునర్వ్యవస్థీకరణపై సమావేశం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త ఎస్. నిసార్ అహమద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, మునిసిపల్ అధికారులు విడుదల చేసిన వార్డుల జాబితాపై అభ్యంతరాలను సేకరించారు. ప్రజల అభిప్రాయాలు, భౌగోళిక పరిస్థితులు, జనాభా అంశాలను పరిగణనలోకి తీసుకుని పునర్వ్యవస్థీకరణ జరగాలని నేతలు అభిప్రాయపడ్డారు. వార్డుల వారీగా అభ్యంతరాలను సిద్ధం చేసి మే 23లోగా పార్టీ కమిటీకి అందజేయాలని నిసార్ అహమద్ సూచించారు.










