అన్నమయ్య జిల్లా, పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కమిటీ పిలుపుమేరకు బుధవారం నిరసన తెలిపారు. జిల్లా కార్యదర్శి పోకల మునికృష్ణ మాట్లాడుతూ, పీఆర్సీ కమిటీని నియమించి ఐఆర్ మరియు డీఏలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని కూడా వారు కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










