సోమలలో భక్తిశ్రద్ధలతో గంగ జాతర నిర్వహణ

0
5

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలో బుధవారం నడివీధి గంగ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ప్రతిమను ఘనంగా ఊరేగించారు. అనంతరం మహిళలు పొంగళ్లను నైవేద్యంగా పెట్టి పూజలు చేశారు. శివాలయం వద్దకు తీసుకువెళ్లి నడివీధిలో ప్రతిష్ఠించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి మొక్కులు చెల్లించారు. పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు# కొత్తూరు మురళి .