TG: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బండి సంజయ్ ఢిల్లీలో కలిసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్ర పరిస్థితులను బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు అధిష్ఠానానికి వివరించినట్లు సమాచారం.
దీంతో అమిత్ షా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు.










