శనివారం రాత్రి రాజంపేట మండలం వెంకట రాజంపేటలోని కనకదుర్గమ్మ గుడిలో ఇద్దరు దొంగలు హుండీని బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. స్కూటర్పై వచ్చిన దొంగలు గుడిలోకి ప్రవేశించి.
హుండీని పగలగొట్టేందుకు విఫలయత్నం చేశారు. ఈ ఘటన ఆలయ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దొంగతనాలు జరగకుండా రాత్రి పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.









