మదనపల్లిలో బక్రీద్ పండుగ సందర్భంగా డీఎస్పీ పావని ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్, మత పెద్దలు పాల్గొన్నారు. హిందూ, ముస్లిం సోదరులు ఐకమత్యంతో, సమన్వయంతో పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని డీఎస్పీ సూచించారు. సమాజంలో శాంతి, సామరస్యాలను కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.










