కట్నం పిచ్చి: గర్భిణీపై అత్తగారింటి వేధింపులు

0
4

అదనపు కట్నం తీసుకురావాలని గర్భిణీ అయిన తనను భర్త ఇంట్లో నుంచి గెంటివేశాడని మదనపల్లె జిల్లాకు చెందిన ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ (స్పందన) కార్యక్రమంలో ఆమె ఎస్పీని కలిసి న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. రామసముద్రం మండలం గజ్జిగంగన్నపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యం తనను కనికరం లేకుండా వేధించి, ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని బాధితురాలు కన్నీటిపర్యంతమయ్యారు.