పుంగనూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ వెంకటేశులు సోమవారం తెలిపారు. బీకాం, బీకాం కంప్యూటర్, బీఏ పొలిటికల్ సైన్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కళాశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో పాటు ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్ యూనిట్లు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు కొత్తూరు మురళి.










