బి.కొత్తకోట మండలంలోని గొళ్లపల్లి ZP హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న చందన, వరుణ్లు 555 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. టాపర్గా నిలిచిన వారికి HM శాంతి కుమారి విమాన ప్రయాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, టాపర్లుగా నిలిచిన చందన, వరుణ్లను తిరుపతి నుంచి విజయవాడకు విమానంలో తీసుకెళ్లినట్లు MEO రెడ్డిశేఖర్ తెలిపారు. ఈ సంఘటన విద్యార్థులలో స్ఫూర్తి నింపింది.










