థాంక్యూ సీఎం సార్ ప్రచార బస్సును జండా ఊపి ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి|

0
2

 

 

‘ *Thank you CM Sir’ ప్రచార బస్సును జెండా ఊపి ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.*

 

*కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా ప్రత్యేక బస్సు ప్రారంభం.*

 

*అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ప్రైవేటు బస్సును పరిశీలించిన మంత్రి*

 

ప్రైవేట్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన కృతజ్ఞత సభ అనంతరం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేకంగా రూపొందించిన “Thank you CM Sir” ప్రచార సందేశంతో ఉన్న బస్సును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ప్రైవేటు బస్సును మంత్రి పరిశీలించారు. టూరిస్ట్ బస్సుల పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల కృతజ్ఞతగా ఈ ప్రత్యేక బస్సును ప్రారంభించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ప్రైవేట్ రవాణా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గౌతమ్ కిరణ్, ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.