చిత్తూరు జిల్లా పుంగనూరులో సోమవారం జరిగిన వారపు సంతలో కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. దిగుబడులు తగ్గడంతో మునగ, వంకాయ, బీరకాయ, ముల్లంగి, బెండకాయ, క్యాప్సికమ్ వంటివి కిలో రూ.60 పలికాయి. తెల్లగడ్డలు, అల్లం రూ.160, బీన్స్, క్యారెట్ రూ.80, పచ్చిమిర్చి రూ.40, ఆలుగడ్డ రూ.30, టమోటా, ఎర్రగడ్డలు రూ.25 చొప్పున ధరలు నమోదయ్యాయి. ఈ ధరల పెరుగుదల వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది# కొత్తూరు మురళి.










