పార్వతీపురం(M) వెలగవలస గ్రామానికి చెందిన తాడంగి రమేశ్ను చేతబడి నెపంతో గ్రామానికి చెందిన కొందరు కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ మేరకు మృతుడి తమ్ముడు శ్రీధర్ ఫిర్యాదు మేరకు పార్వతీపురం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ ఆదేశాలతో 2 బృందాలుగా పోలీసులు విడిపోయి H. కారాడవలస జంక్షన్ వద్ద నిందితులను అరెస్టు చేశామని, మరికొంతమందిని అరెస్టు చేయాల్సి ఉందని ఏఎస్పీ మనీషారెడ్డి పేర్కొన్నారు.
#Boiena Rajesh










