పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, కంభంవారిపల్లి పంచాయతీ పరిధిలో రెండు రోజులుగా వ్యవసాయ పొలాల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు స్టార్టర్లు, కేబుల్ వైర్లు చోరీ చేస్తున్నారని బాధిత రైతులు గురువారం తెలిపారు. నరేష్ అనే రైతు తన పొలంలో రూ. 17 వేలు విలువైన మోటార్, స్టార్టర్, కేబుల్ చోరీకి గురయ్యాయని, అలాగే మరో ఐదుగురు రైతులకు చెందిన కేబుళ్లు, స్టార్టర్లు కూడా దొంగిలించబడ్డాయని వెల్లడించారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు# కొత్తూరు మురళి.










