మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు: సీఐ సుబ్బరాయుడు

0
0

అన్నమయ్య జిల్లా పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి పోస్టులు చేస్తే, వాట్సాప్ గ్రూపులలో అలాంటి సందేశాలు వస్తే వెంటనే గ్రూప్ అడ్మిన్లు తొలగించాలని, నిర్లక్ష్యం వహిస్తే వారిపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు చిత్తూరు, పుంగనూరు ప్రాంతాల్లో ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి# కొత్తూరు మురళి.