“పెండింగ్ సమస్యల పరిష్కారానికి డీసీని కలిసిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.|

0
32

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ సర్కిల్ పరిధిలోని పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు.

ప్రేమ్, సాజిద్, లింగారెడ్డి, మహేందర్, రాజేందర్‌లతో కలిసి డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్‌ కు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

కొత్త చెరువు కట్ట నుంచి సెలెక్ట్ థియేటర్ వైపు వెళ్లే రహదారి, అలాగే నాగిరెడ్డి కాలనీ సమీపంలోని ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిన్నందున వాటిని అత్యవసరంగా మరమ్మతులు చేయాలని కోరారు. అదేవిధంగా లోయోలా కళాశాల సమీపంలో, రాజీవ్ వీకర్ సెక్షన్ ప్రాంతంలో వీధి దీపాలు పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎంఈఎస్ కాలనీలో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, మురుగునీటి పారుదల మరియు చెత్త తొలగింపు పనులను వేగవంతం చేయాలని డీసీ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అధికారులను కోరగా, వినతిపత్రంలో పేర్కొన్న అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

#Sidhumaroju

Alwal