మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్

0
0

AP: అల్లూరి జిల్లా డుంబిరిగుడ మండలం పెదపాడు గ్రామాన్ని గతేడాది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. తమ గ్రామంలో శిథిలావస్థకు చేరిన భవనంలోనే పిల్లలు చదువుకోవాల్సి వస్తోందని గ్రామస్తులు వాపోయారు.

విద్యార్థుల కోసం నూతన భవనం కావాలని పవన్‌కు విన్నవించారు. భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చిన పవన్ తన మాటను నిలబెట్టుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గతంలో రూ.17.50 లక్షల నిధులు మంజూరయ్యాయి. తాజాగా భవన నిర్మాణం పూర్తయ్యింది.

 

#pavankalyan