జాహ్నవి మిస్సింగ్ కేసు.. పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్

0
0

AP: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సమీపంలో మూడేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై ఆరు రోజులు గడిచింది. చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన నెలకొంది. పామాయిల్ తోటలో ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి కనిపించకుండా పోయింది.

చిన్నారితోపాటు వెళ్లిన పెంపుడు కుక్క తిరిగి రావడంతో కేసు మరింత మిస్టరీగా మారింది. తాజాగా కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాని కదలికలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.