శీర్షిక: ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు: మంత్రి భరత్
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి, వేలాది ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని స్పష్టం చేశారు.
కర్నూలు జాబ్మేళాలో 19 కంపెనీలు 1,460 ఉద్యోగాలు అందించాయని, ప్రతి మూడు నెలలకోసారి జాబ్మేళాలు ఉంటాయని చెప్పారు. సీఎం చంద్రబాబు, లోకేశ్ నాయకత్వంలో రిలయన్స్, అగస్త్య వంటి సంస్థలను కర్నూలుకు తెచ్చామని, జైరాజ్ ఇస్పాత్ మరో రూ.6 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుందని మంత్రి వెల్లడించారు.










