చీరాల
చీరాలలోని బెస్తపాలెం శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం వద్ద గురుపౌర్ణమి వేడుకలు, ఆలయ 25వ వార్షికోత్సవం వేడుకలు బెస్తపాలెం సాయిబాబా కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో శోభాయమానంగా సాగాయి.
వేడుకల్లో భాగంగా 150 నుండి 200 మందికి పైగా నిరుపేదలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అలాగే పేదవారికి విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అనంతరం సుమారు 6,000 నుండి 7,000 మంది భక్తులకు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ వేడుకలకు, సేవా కార్యక్రమాలకు ధన వస్తు రూపంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ బెస్తపాలెం యూత్ మహిళలు గ్రామప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. సాయిబాబా ఆశీస్సులు భక్తులందరిపై నిరంతరం ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తుపాకుల ప్రసాద్, పల్లా వెంకటేష్, తుపాకుల రఘునాథ్, తుపాకుల లీల కృష్ణ, తుపాకుల శివ నాగరాజు, తుపాకుల విజయ్, తుపాకుల సాయి జగదీష్, పల్లా శ్రీనివాసరావు, పల్లా గోపాల్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు









